రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్ సంక్షోభమే అజెండాగా వీరి సంభాషణ జరిగిందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు విషయంపై కూడా వీరిద్దరూ మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్- రష్యా మధ్య జరుగుతున్న చర్చల గురించి కూడా పుతిన్ మోదీకి వివరించారు. ప్రస్తుతం అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయని, అలా కాకుండా ఏకంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనే సంభాషించాలని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్కు సూచించారు.
ఉక్రెయిన్లోని కొన్ని ప్రాంతాల్లో కాల్పుల విమరణ, ప్రజల తరలింపు కోసం కారిడార్ల ఏర్పాటుకు పుతిన్ సుముఖత వ్యక్తం చేయడాన్ని మోదీ ప్రశంసించారు. ఇక.. సుమీ నుంచి భారతీయులను సురక్షితంగా తరలించే విషయంపై కూడా మోదీ పుతిన్తో మాట్లాడారు. సుమీ నుంచి భారతీయులను సురక్షితంగా తరలించే విషయంలో తమకు సహకరించాలని మోదీ కోరారు. ఇందుకు పుతిన్ అంగీకరించారు. భారతీయుల తరలింపులో తాము సహాయపడతామని మోదీకి హామీ ఇచ్చారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక