న్యూఢిల్లీ : జీ7 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిస్ ట్రుడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రన్లతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం భేటీ అయ్యారు. అంతకుముందు జీ7 సదస్సులో ప్రధాని మోదీకి జర్మన్ ఛాన్స్లర్ ఒలఫ్ స్కోల్జ్ స్వాగతం పలికారు.
ఉక్రెయిన్లో రష్యా దమనకాండ విషయంలో మాస్కోపై జీ7 ఒత్తిడి తీసుకువస్తుందని, రష్యన్ చమురు ధరలపై పరిమితి విధించే ప్రణాళిలకపై కసరత్తు సాగిస్తుందని సీనియర్ అమెరికన్ అధికారి పేర్కొన్నారు. ఇక ప్రధాని మోదీ ఆదివారం అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్తో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
ఇరువురు నేతల మధ్య ఇదే తొలి ద్వైపాక్షిక సమావేశం కావడం గమనార్హం. ఈ భేటీలో ఇరువురు నేతలు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ సహకారం, వ్యవసాయం, ఆహార భద్రత సహా పలు అంశాలపై చర్చించారు. భారత్-అర్జెంటీనాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను ఇరువురు నేతలు సమీక్షించారు. పలు జీ7 దేశాధినేతలతోనూ ప్రధాని మోదీ చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.