లండన్: ఎక్కువ మొక్కలను నాటడం ద్వారా నగరాల్లో అధిక వేసవి ఉష్ణోగ్రతల వల్ల సంభవించే అకాల మరణాలను మూడో వంతు తగ్గించవచ్చని లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన నివేదిక వెల్లడించింది. 93 యూరోపియన్ నగరాల్లో జరిపిన ఈ అధ్యయనం ప్రకారం పట్ణణాల్లో పచ్చదనం 30 శాతం పెరిగితే ఉష్ణోగ్రతలను 0.4 డిగ్రీల సెల్సియస్ తగ్గించి వాటి వల్ల కలిగే మరణాలను నివారించవచ్చు. పట్టణ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతల వల్ల గుండె, ఊపిరితిత్తుల వైఫల్యం, అకాల మరణాలు సంభవిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందేనని బార్సిలోనా ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ శాస్త్రవేత్త టామర్ లంగ్మ్యాన్ పేర్కొన్నారు.