కాఠ్మాండూ, మే 29: నేపాల్లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. తారా ఎయిర్లైన్స్కు చెందిన 9ఎన్-ఏఈటీ విమానం ఆదివారం కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 22 మంది ఉన్నారు. ఇందులో భారత్కు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు సభ్యులు ఉన్నారు. వీరు ముంబైకి చెందినవారిగా గుర్తించారు. ఫ్లైట్లో ఉన్న 22 మంది చనిపోయినట్టు అనుమానిస్తున్నారు. విమానం ఆదివారం ఉదయం 9.55 గంటలకు పొఖారా నుంచి టేకాఫ్ అయింది. నిమిషాల వ్యవధిలోనే గల్లంతైంది. లానింగ్చోగ్లాలో విమానాన్ని కాలిపోయిన స్థితిలో గుర్తించినట్టు నేపాల్ ఆర్మీ మేజర్ జనరల్ బాబూరాం శ్రేష్ఠ చెప్పారు.