బీజింగ్ : చైనాలో సోమవారం భారీ విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగి దాదాపు 24 గంటలు కావొస్తున్నా ఇప్పటి వరకు సిబ్బంది, ప్రయాణికుల్లో ఎవరూ ఆచూకీ దొరకలేదు. ఘోర ప్రమాదం తర్వాత ఎవరూ సజీవంగా బతుకుతారనే ఆశలు లేవని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆదేశించారు. చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737-800 విమానం సోమవారం మధ్యాహ్నం గ్వాంగ్జీలో కూలిపోయింది. కున్మింగ్ నుంచి గ్వాంగ్జౌకు వెళ్తున్నది.
విమానం రాడార్ నుంచి అందిన సమాచారం ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.11 గంటలకు కున్మింగ్ విమానాశ్రయం నుంచి బోయింగ్ విమానం బయలుదేరింది. మధ్యాహ్నం 2.20 గంటలకు 29,100 అడుగుల ఎత్తులో ఎగురుతోంది. ఆ తర్వాత విమానం కుప్పకూలడంతో రాడార్తో సంబంధాలు తెగిపోయాయి. సమాచారం అందుకున్న అధికారుల సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. చైనా స్టేట్ బ్రాడ్కాస్టర్ సీసీటీవీ నివేదిక ప్రకారం.. దుర్ఘటన జరిగిన సమయంలో 132 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు.
ఇప్పటి వరకు ప్రమాదంలో ఒక్కరు సైతం సజీవంగా కనిపించలేదు. విమానం పర్వత ప్రాంతంలో కూలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు ఎంతగా ఉన్నాయంటే నాసా పంపిన ఉపగ్రహాల్లోనూ రికార్డయ్యేంత భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ప్రమాదంపై చైనా అధ్యక్షుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు ఘటనపై దర్యాప్తు చేయాలని ఆదేశించారు. పౌర విమానయాన రంగంలో భద్రతా ఏర్పాట్లను పరిష్టం చేయాలని ఆదేశించారు. చైనా పౌర విమానయాన శాఖ నేతృత్వంలోని దర్యాప్తులో సహాయం చేసేందుకు తమ సాంకేతిక నిపుణుల బృందం సిద్ధంగా ఉన్నారని ఏరోస్పేస్ సంస్థ తెలిపింది.
Temporary tents have been set up for rescue efforts for the crashed passenger plane in Tengxian County, S China’s Guangxi https://t.co/Sb3Z2ev7o9 pic.twitter.com/OYOjfVPw1w
— China Xinhua News (@XHNews) March 22, 2022