న్యూఢిల్లీ: సీబీఐ కొత్త చీఫ్గా సీనియర్ ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్ను నియమించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోమవారం ప్రధాని మోదీ నివాసంలో జరిగిన సమావేశంలో సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ప్రధాన ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరితో సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాపై ప్రధాని చర్చించారు. ఈ సమావేశంలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను షార్ట్ లిస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్ డీజీపీ, 1985 బ్యాచ్ అధికారి హెచ్సీ అవస్థి, సశస్త్ర సీమాబల్ డైరెక్టర్ జనరల్ కేఆర్ చంద్ర, హోం శాఖలో ప్రత్యేక కార్యదర్శి వీఎస్కే కౌముది పేర్లను ప్రాథమికంగా ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. అంతకుముందు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ జోక్యంతో బీఎస్ఎఫ్ చీఫ్ రాకేష్ ఆస్తానా, ఎన్ఐఏ చీఫ్ యోగేష్ చందర్ మోదీల పేర్లను జాబితాను తొలగించారు. కనీసం 6 నెలలు పదవీకాలం ఉన్నవారిని సీబీఐ చీఫ్గా నియమించాలని గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పును చీఫ్ జస్టిస్ రమణ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
కానీ, రాకేష్ ఆస్తానా, యోగేష్ చందర్ ఇద్దరూ ఆరు నెలలలోపే పదవీ విరమణ చేయనున్నారు. దాంతో వారు పోటీ నుంచి తొలగిపోయారు. ఇక మిగిలిన వారిలో గతంలో మహారాష్ట్ర డీజీపీగా పనిచేసిన సుబోధ్ కుమార్ జైస్వాల్ను సీబీఐ కొత్త డైరెక్టర్గా నియమించాలని సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. మంగళవారం రాత్రికల్లా సీబీఐ న్యూ చీఫ్ ఎవరనే విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.