Petrol Rate | పాక్లో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచింది. ఈ పెంపుతో ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తీవ్రమైన నగదు కొరతను ఎదుర్కొంటున్న దాయాది దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధర రూ.330 వరకు పెరిగింది. ఇప్పటికే ద్రవ్యోల్బణం ఇప్పటికే రెండంకెలకు చేరుకుంది.
తాత్కాలిక ప్రధానమంత్రి అన్వరుల్ హక్ కాకర్ ఆమోదం తర్వాత ప్రభుత్వం పెట్రోల్పై రూ.26.02, డీజిల్ రూ.17.34 పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు సెప్టెంబర్ ఒకటిన ఆపద్ధర్మ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.14 వరకు పెంచింది. అయితే, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ప్రజలపై ఆర్థిక భారం పడనున్నది.