టొరంటో: కెనడా సైనిక దళం భారీ ప్రకటన చేసింది. ఆ దేశంలో ఉన్న శాశ్వత నివాసితులకు ఆఫర్ ఇచ్చింది. పర్మనెంట్ రెసిడెంట్స్ ఇక మిలిటరీలో చేరవచ్చు అని కెనడా ప్రకటించింది. ఈ ప్రకటన భారతీయులకు ఉపయుక్తం కానున్నది. రిమెంబరెన్స్ డే నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. అయితే ఇటీవల కెనడా సైన్యంలో చేరికలు తగ్గాయి. కొత్తగా సైనికుల్ని రిక్రూట్ చేయలేకపోతున్నారు. దీంతో వేలాది ఖాళాలు ఏర్పడ్డాయి. ఆ ఖాళీలను పూరించేందుకు పర్మనెంట్ రెసిడెంట్స్కు కూడా సైన్యంలో చేరే అవకాశం కల్పించారు.
2021 డేటా ప్రకారం కెనడాలో 80 లక్షల మంది వలసవాదులకు పర్మనెంట్ రెసిడెన్సీ ఉంది. కెనడా జనాభాలో వలసవాదులుసుమారు 21.5 శాతం ఉన్నారని తెలుస్తోంది. 2021లో లక్ష మంది భారతీయులకు కెనడా ప్రభుత్వం పర్మనెంట్ రెసిడెన్సీ కల్పించింది. రాబోయే రెండేళ్లలో మరో పది లక్షల మందికి కెనడా రెసిడెన్సీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.