సియోల్: దక్షిణ కొరియా(South Korea)లో ఏషియానా ఎయిర్లైన్స్కు చెందిన విమాన డోర్ను ఓ ప్యాసింజెర్ తెరిచాడు. ఆ సమయంలో విమానం(Plane)లో 194 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ విమానాన్ని డేగు విమానాశ్రయంలో దించారు. ఏ321 విమానం గాలిలో ఉన్నప్పుడు ఓ వ్యక్తి ఆ విమాన్ డోర్ను తీశాడు. నిజానికి అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆ డోర్ కొద్దిగా ఓపెన్ అయ్యింది.
దక్షిణ దీవి జేజూ నుంచి డేగూ వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. విమానంలో ఉన్న 194 మంది భయాందోళనలకు లోనయ్యారు. అయితే ఎంత సేపు డోర్ ఓపెన్ చేశారన్న అంశంపై క్లారిటీ లేదు. డోర్ ఓపెన్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎందుకు అతను అలా చేశాడో ఇంకా నిర్దారణ కాలేదు. ఉల్సన్లో జరుగుతున్న ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు చాలా మంది అథ్లెట్లు ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. శ్వాస కోస ఇబ్బందులు తలెత్తిన్న ప్రయాణికులను హాస్పిటల్కు తరలించినట్లు రవాణాశాఖ తెలిపింది.
Asiana Airlines A321 lands safely at Daegu Airport in South Korea after the emergency exit door was opened by a passenger on approach. 9 people taken to hospital with breathing difficulties. pic.twitter.com/Jzed4PMDvc
— Breaking Aviation News & Videos (@aviationbrk) May 26, 2023