న్యూయార్క్: ఏఐ సాయంతో వైద్యులు నిర్వహించిన పక్షవాతం చికిత్స విజయవంతమైంది. లాంగ్ ఐలాండ్కు చెందిన 45 ఏండ్ల థామస్ 2020లో స్విమ్మింగ్ ఫూల్లో డైవింగ్ చేస్తున్నప్పుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో మెడ విరిగి, వెన్నెముకకు గాయాలయ్యాయి.
ఆయనకు ఫెయిన్స్టెయిన్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ రిసెర్చ్ వైద్యులు అధునాతన సర్జరీ నిర్వహించారు. ఇందులో మొదటిసారిగా ఏఐని వాడారు. మైక్రో ఎలక్ట్రోడ్ ఇంప్లాంట్ ద్వారా మెదడుకు కంప్యూటర్ను అనుసంధానించి 15 గంటలపాటు సర్జరీ నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడంతో ప్రస్తుతం థామస్ తన తల, కుడి చేతిని కదిలించగలుగుతున్నాడు.