కాబూల్: తాలిబన్లు, పాకిస్థాన్, ఆల్ఖైదా బలగాల నిరంతర దాడులతో విలవిల్లాడుతున్న పంజ్షీర్ ప్రతిఘటన బలగాలు.. శాంతి ప్రతిపాదన చేశాయి. ఆమోదయోగ్య పరిష్కారం కనుగొనాలని సూచించాయి. దీంతో ఆఫ్ఘన్ మాజీ భద్రతా బలగాల ఆధ్వర్యంలో తాలిబన్లకు వ్యతిరేకంగా రూపుదిద్దుకున్న నేషనల్ రిసిస్టెన్స్ ఫ్రంట్ (ఎన్ఆర్ఎఫ్) అలియాస్ పంజ్షీర్ ప్రతిఘటన బలగాలు వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది.
గత నెలలో కాబూల్ను తాలిబన్లు కైవశం చేసుకోవడానికి వ్యతిరేకంగా ఎన్ఆర్ఎఫ్ బలగాలు ఉద్యమించాయి. మాజీ ముజాహిద్దీన్ కమాండర్ అహ్మద్ షా మసూద్ తనయుడు.. ఆఫ్ఘన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ అమృల్లా సాలేహ్ ఆధ్వర్యంలో వీరు ప్రతిఘటించారు. తాజాగా ఎన్ఆర్ఎఫ్ బలగాలు శాంతి కోసం పెద్దల సాయం కోరినట్లు సమాచారం. తక్షణం యుద్ధాన్ని నిలిపేందుకు సహకరించాలని అభ్యర్థించారని తెలుస్తోంది.