ఇస్లామాబాద్: పాకిస్థాన్ గురువారం నిర్వహించిన మిస్సైల్ పరీక్ష విఫలమైంది. సింధ్ ప్రావిన్సులోని జామ్ష్రో ప్రాంతంలో ఓ గుర్తు తెలియన వస్తువు ఆకాశంలో కనిపించింది. దీంతో స్థానికులు తొలుత కంగారుపడ్డారు. అయితే ఆ వస్తువు రాకెటా లేక మిస్సైలా అని ఆందోళన చెందారు. కానీ సింధ్లో ఉన్న టెస్టింగ్ రేంజ్ నుంచి ప్రయోగించిన క్షిపణి విఫలమైనట్లు ఆ తర్వాత తెలుసుకున్నారు. ఉదయం 11 గంటలకు జరగాల్సిన పరీక్ష గంట ఆలస్యమైంది. ట్రాన్స్పోర్టర్ ఎరక్టర్ లాంచర్లో సాంకేతిక సమస్య వల్ల ప్రయోగాన్ని ఆలస్యంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే గాలిలోకి ఎగిరిన కొన్ని సెకన్లలోనే ఆ మిస్సైల్ గతితప్పింది. సింధ్లోని తానా బులా ఖాన్ ప్రాంతంలో ఆ మిస్సైల్ పడింది.