Imran Khan | ఇస్లామాబాద్, జనవరి 30: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు ప్రత్యేక కోర్టు మంగళవారం పదేండ్ల జైలు శిక్ష విధించింది. దేశ రహస్యాలను బహిర్గతం చేశారన్న కేసులో ఆయనతో పాటు మాజీ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీకి కూడా ఇదే శిక్ష విధించింది.
ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ తీర్పు రావడం పాకిస్థాన్-ఈ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీకి శరాఘాతంగా పరిణమించింది. రావల్పిండిలోని అడియాల జైలులోని ప్రత్యేక కోర్టులో జడ్జీ అబుల్ హస్నత్ ఇచ్చిన తీర్పు కారణంగా ఇమ్రాన్, ఖురేషీ అయిదేండ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు.