Pakistan | ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడుతున్న పాకిస్థాన్లో ఇప్పుడు ఔషధాల కొరత నెలకొన్నది. మందులు దొరక్క.. వైద్యులు శస్త్రచికిత్సలను సైతం నిలిపివేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు.
కిడ్నీ, గుండె, క్యాన్సర్ సహా పలు సున్నితమైన ఆపరేషన్ల సమయంలో రోగులకు ఇచ్చే అనస్థీషియా (మత్తు మందు) నిల్వలు కూడా రెండు వారాలకు సరిపడా మాత్రమే ఉన్నాయని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ముడి సరుకుల దిగుమతి లేకపోవడంతో ఔషధాల ఉత్పత్తి తగ్గిపోయిందని ఫార్మాస్యూటికల్ తయారీదారులు పేర్కొంటున్నారు.