PTI Party | పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెందిన పార్టీ పీటీఐ ఆ దేశ అవినీతి నిరోధకశాఖ, ఆర్మీకి చెందిన రేంజర్స్పై కేసు నమోదు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇస్లామాబాద్ హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్ను కిడ్నాప్ చేశారని ఎఫ్ఐఆర్ దాఖలు చేయనున్నది. ఇటీవల పీటీఐ చైర్మన్ అరెస్టుతో పాక్లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై కాల్పులు జరిపారని, వారిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని భావిస్తున్నారు.
ఇమ్రాన్ అరెస్టు తర్వాత చెలరేగిన హింసాకాండలో దాదాపు మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆయా ఘటనల్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారని మాజీ ప్రధాని పార్టీ ఆరోపిస్తున్నది. నిరసనల సందర్భంగా ఆగ్రహం చెందిన గుంపు రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయానికి, లాహోర్లోని టాప్ కార్ప్స్ కమాండర్ ఇంటికి నిప్పుపెట్టారు.
పీటీఐ నమోదు చేయనున్న కేసుకు సంబంధించిన ఫిర్యాదులో పాక్ అంతర్గత మంత్రి రాణా సనావుల్లా, పంజాబ్, ఖైబర్ పంఖ్తుంక్వా ప్రావిన్సుల తాతాల్కిక ముఖ్యమంత్రులు, పోలీస్ ఐజీలతో పాటు సీనియర్ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నిర్ణయించింది. ఇందుకు ముందు ఇంటర్వ్యూలో ఇమ్రాన్ పాక్లో ప్రజాస్వామ్యం ఇబ్బందులో ఉందని, దేశానికి న్యాయవ్యవస్థ ఆశాజనకంగా ఉందన్నారు. ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోతామని ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు.