బస్సు, ట్రెయిన్ డ్రైవర్లు అంటే తమ డ్యూటీ అయిపోగానే.. వెంటనే బస్సు దిగి వెళ్లిపోతారు. బస్సును డిపోలో పార్క్ చేసి బస్ డ్రైవర్ వెళ్లిపోతాడు. ఏదైనా రైల్వే స్టేషన్ రాగానే.. ట్రెయిన్ డ్రైవర్ కూడా తన డ్యూటీ అయిపోయిందని వెళ్లిపోతే.. మరో డ్రైవర్ వస్తాడు. మరి.. విమానం గాల్లో ఉండగా.. మధ్యలో నా డ్యూటీ అయిపోయింది అని పైలట్ విమానాన్ని వదిలేస్తే ఎలా ఉంటది. అలా కూడా చేస్తారా ఎవరైనా అంటారా? ఇదిగో పాకిస్థాన్లో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
సౌదీ అరేబియాలోని రియాద్ నుంచి పీకే 9754 అనే విమానం టేకాఫ్ అయింది. అది పాకిస్థాన్లోని ఇస్లామాబాద్కు వెళ్తోంది. మధ్యలో వాతావరణం అనుకూలించక.. దమ్మమ్ అనే ప్రాంతంలో లాండ్ అవాల్సి వచ్చింది. ఆ తర్వాత అది దమ్మమ్ నుంచి ఇస్లామాబాద్ వెళ్లాలి.
అయితే.. అప్పటికే తన డ్యూటీ అయిపోయిందని.. ఇక తాను విమానాన్ని నడపను అని పైలెట్ చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకు అని ఆరా తీస్తే తన డ్యూటీ అయిపోయిందని.. ఇప్పుడు తాను విమానాన్ని నడపలేనని చెప్పేశాడు. దీంతో ప్యాసెంజర్లు అవాక్కయ్యారు. ఇప్పటికే వాతావరణం అనుకూలించక విమానం లేట్ అయితే.. మళ్లీ పైలెట్ విమానం నడపను అనేసరికి ప్యాసెంజర్లకు చిర్రెత్తుకొచ్చింది.
విమానంలోని ప్యాసెంజర్లు విమానం దిగడానికి ససేమిరా అనడంతో తప్పని పరిస్థితుల్లో వాళ్లకు దమ్మమ్లోని హోటల్లో బస ఏర్పాటు చేయాల్సి వచ్చింది. నిజానికి.. పైలెట్స్కు తమ డ్యూటీ అయిపోయాక.. ఎక్స్ట్రా డ్యూటీ చేయాల్సి వస్తే వాళ్లు అలసిపోతారట. వాళ్లకు ప్రాపర్ రెస్ట్ ఉండాలట. ఆ ఉద్దేశంతోనే ఆ పైలెట్ తన డ్యూటీ అయిపోయిందని.. తను ఇక విమానం నడపలేనని చెప్పి ఉండొచ్చని పీఏఐ అధికారులు వెల్లడించారు. అందుకే ప్యాసెంజర్లకు కూడా హోటల్లో బస ఏర్పాటు చేశామని.. ఆ తర్వాత వాళ్లను అదే రోజు 11 గంటల కల్లా విమానంలో ఇస్లామాబాద్ పంపించే ఏర్పాట్లు చేశామన్నారు.