ఇస్లామాబాద్: హోళీ పండుగపై పాకిస్థాన్(Pakistan)లో బ్యాన్ విధించారు. పాకిస్థాన్ ఉన్నత విద్యా మండలి ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో రంగుల పండుగ హోళీతో పాటు ఇతర హిందూ పండుగలను నిషేధించింది. ఖైద్ -ఈ- ఆజామ్ యూనివర్సిటీ లో విద్యార్థులు హోళీ రంగులతో ఎంజాయ్ చేశారు. ఈ నేపథ్యంలో పాక్ విద్యా మండలి నిర్ణయం తీసుకున్నది. జూన్ 12వ తేదీన జరిగిన ఘటన పట్ల విమర్శలు వచ్చాయి. మెహ్రాన్ స్టూడెంట్స్ కౌన్సిల్ ఆ ఈవెంట్ను ఆర్గనైజ్ చేసింది. హోళీ ఆడుతూ చిందులు వేస్తున్న విద్యార్ధుల వీడియోలను యూనివర్సిటీ అఫీషియల్ పేజీలో పోస్టు చేశారు. దీంతో ఆ వేడుకపై దుమారం చెలరేగింది. కొందరు ఆహ్వానించగా, మరికొందరు వ్యతిరేకించారు.
Holi celebrations in Quaid-I-Azam University Islamabad Pakistan 🍁
Biggest holi celebration in Pakistan 💓 pic.twitter.com/xdBXwYEglt— QAU News (@NewsQau) June 13, 2023