ఇస్లామాబాద్: చంద్రయాన్-3(Chandrayaan-3)కి చెందిన విక్రమ్ ల్యాండర్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు చంద్రుడిపై దిగనున్న విషయం తెలిసిందే. ఆ ఉత్కంఠ క్షణాల కోసం యావత్ ప్రపంచం తీక్షణంగా ఎదురుస్తోంది. ఇస్రో శాస్త్రవేత్తలు ఆ అద్భుత ఘడియల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇస్రో విజయవంతంగా చేపడుతున్న చంద్రయాన్ మిషన్పై పాకిస్థాన్ మాజీ సమాచారశాఖ మంత్రి ఫహద్ చౌదరీ(Fawad Hussain) ప్రశంసలు కురిపించారు. పాకిస్థాన్ మీడియా ఆ ల్యాండింగ్ కార్యక్రమాన్ని లైవ్లో ప్రసారం చేయాలని ఆయన సూచన చేశారు. భారతీయ శాస్త్రవేత్తలకు ఆయన కంగ్రాట్స్ తెలిపారు. మానవజాతి మనుగడలో ఇదో చరిత్రాత్మక సందర్భం అని ఆయన కీర్తించారు. మాజీ మంత్రి ఫహద్ చౌదరీ తన ట్వీట్లో ఈ విషయాన్ని తెలిపారు.
Pak media should show #Chandrayan moon landing live tomorrow at 6:15 PM… historic moment for Human kind specially for the people, scientists and Space community of India…. Many Congratulations
— Ch Fawad Hussain (@fawadchaudhry) August 22, 2023
విక్రమ్ మాడ్యూల్ ల్యాండింగ్ నేపథ్యంలో భారత్లో దేశవ్యాప్తంగా పూజలు నిర్వహిస్తున్నారు. విజయవంతంగా ఆ ప్రక్రియ పూర్తి కావాలని దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. స్కూళ్లలోనూ ఆ కార్యక్రమాన్ని లైవ్ ప్రసారం చేయనున్నారు. చంద్రయాన్-2 నుంచి గుణపాఠం నేర్చుకున్న ఇస్త్రో శాస్త్రవేత్తలు.. చంద్రయాన్-3ని విజయవంతంగా చంద్రుడిపై దించేందుకు సమాయాత్తం అయ్యారు.