న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానానికి(Air India Flight) భారీ ప్రమాదం తప్పింది. పుణె విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానం.. రన్వేపై లగేజీ ట్రాక్టర్ను ఢీకొట్టింది. రన్వే దిశగా వెళ్తున్న సమయంలో పుణె విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. గురువారం ఈ ప్రమాదం జరిగింది. అయితే ఆ సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. టగ్ ట్రాక్టర్ ను ఢీకొనడం వల్ల విమానం ముక్కు భాగం డ్యామేజ్ అయ్యింది. ల్యాండింగ్ గెయిర్కు చెందిన టైరు కూడా స్వల్పంగా దెబ్బతిన్నది. భారీగానే ట్రాక్టర్ను ఢీకొట్టినా.. విమానంలో ఉన్న ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.