Imrankhan | తోషాఖానా కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఊరట లభించింది. ఇస్లామాబాద్ హైకోర్టు మంగళవారం తోషాఖానా కేసును ఆమోదయోగ్యం కాదని పేర్కొంటూ.. ఇమ్రాన్కు బెయిల్ ఇస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అమీర్ ఫరూక్ తీర్పును వెలువరించారు. కానుకలుగా వచ్చిన ఖరీదైన వస్తువులను విక్రయించినట్లుగా ఇమ్రాన్ ఖాన్పై ఆరోపణలున్నాయి. 1974లో పాక్లో ‘తోషఖానా’ క్యాబినెట్ డివిజన్ విభాగాన్ని స్థాపించారు. ప్రజాప్రతినిధులు, పార్లమెంటేరియన్లు, బ్యూరోగ్రాట్లు, అధికారులకు ఇతర ప్రభుత్వాలు, దేశాధినేతలు, విదేశీ ప్రముఖులు ఇచ్చే విలువైన బహుమతులను నిల్వ చేస్తుంటుంది.
ప్రధానిగా ఇమ్రాన్ ఉన్న సమయంలో వచ్చిన విలువైన చేతిగడియారంతో పాటు పలు బహుమతులను అందుకున్నారని.. ఉద్దేశపూర్వకంగా వాటి వివరాలను దాచిపెట్టారని, వాటిని విక్రయించినట్లుగా ఆరోపణలున్నాయి. దీనిపై కేసు నమోదైంది. దీనిపై పీటీఐ కోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా పీటీఐ చీఫ్ లాయర్ గోహర్ ఖాన్ తీర్పు మాట్లాడుతూ.. తీర్పు ‘విజయం’గా పేర్కొన్నారు. తోషాఖానా కేసులో సెషన్ జడ్జి తీర్పుకు వ్యతిరేకంగా అప్పీల్ దాఖలైందని, ఏడాది కోర్టులో పోరాడుతున్నామని, ఇవాళ పీటీఐ గెలిచిందని పేర్కొన్నారు.