న్యూఢిల్లీ: పాకిస్థాన్లోని బలోచిస్తాన్లో రైలు హైజాక్(Train Hijack) అయిన విషయం తెలిసిందే. అయితే ఆ హైజాక్ వెనుక భారత హస్తం ఉన్నట్లు పాకిస్థాన్ ఆరోపించింది. ఆ ఆరోపణలను భారత విదేశాంగ శాఖ ఖండించింది. పాకిస్థాన్ నిరాధారా ఆరోపణలు చేసినట్లు వెల్లడించింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రన్ధీర్ జైస్వాల్ తన ఎక్స్ అకౌంట్లో పాక్ వైఖరిని ఖండించారు. పాకిస్థాన్ ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్ర బిందువు ఎక్కడుందో ప్రపంచ దేశాలు తెలుసు అని, మరొకరిపై వేలు ఎత్తి చూపడం కన్నా.. పాకిస్థాన్ తన అంతర్గత సమస్యలపై దృష్టి పెట్టాలని, తమ వైఫల్యాలకు మరొకర్ని నిందించడం సరికాదు అని రణ్ధీర్ తన పోస్టులో ఆరోపించారు.
క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను బలోచిస్తాన్ రెబల్స్ హైజాక్ చేశారు. ఆ సమయంలో 440 మంది ప్రయాణికులు ఉన్నారు. దాంట్లో 21 మంది పౌరులు, నలుగురు సైనికులు మృతిచెందారు. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో 33 మంది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మిలిటెంట్లు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ గురువారం బలోచిస్తాన్లో పర్యటన చేపట్టి అక్కడ శాంతి, భద్రతల సమస్యను సమీక్షించారు.
Our response to media queries on the remarks made by the Pakistan side ⬇️
🔗 https://t.co/8rUoE8JY6A pic.twitter.com/2LPzACbvbf
— Randhir Jaiswal (@MEAIndia) March 14, 2025