పాక్లో నివసిస్తున్న, ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి పూర్తి రక్షణ కల్పిస్తామని, అందులో అనుమానం పడాల్సిన అవసరమే లేదని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య అన్ని రంగాల్లో సత్సంబంధాలను నెరపాలన్నదే తమ అభిమతమని పాక్ ప్రధాని స్పష్టం చేశారు. పాక్ ప్రధానితో చైనా విదేశాంగ శాఖ కమిషనర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వున్న సంబంధాలను వారు సమీ క్షించుకున్నారు. ఈ సందర్భంగా పాక్, చైనా మధ్య వున్న సంబంధాలు అద్భుతంగా వున్నాయని షెహబాజ్ పేర్కొన్నారు.
చైనా- పాక్ కారిడార్ కింద జరుగుతున్న అన్ని రకాల ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పాక్ ప్రధాని చైనా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కారిడార్ పాక్కు అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని, ఆర్థికంగా, సామాజికంగా కూడా ఈ కారిడార్ పాక్కు ఎంతో ఉపయోగకరమని షెహబాజ్ షరీఫ్ కొనియాడారు. ఈ మేరకు పాక్ ప్రధాని ఆఫీస్ ఓ ప్రకటనను విడుదల చేసింది.
ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇరుపక్షాల మధ్య వుండే నమ్మకం మీదే ఆధారపడి వుంటాయని, ఇరు దేశాలు ఒకరినొకరు గౌరవించుకోవడం ద్వారా ఇబ్బందులను అధిగమించేందుకు వీలుంటుందని పాక్ ప్రధాని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.