Air Strike in Yemen | ఏండ్ల తరబడి అంతర్యుద్దంతో సతమతం అవుతున్న యెమెన్లో శుక్రవారం జరిగిన వైమానిక దాడుల్లో ముగ్గురు పిల్లలతోపాటు 200 మందికి పైగా మరణించడమో, గాయపడటమో జరిగింది. ఒక జైలులో 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తున్నది. మరో ఘటనలో ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. సాదా పట్టణంలో కూలిపోయిన జైలు శిధిలాలు, వీడియో ఫుటేజీలను హుథీ రెబెల్స్ విడుదల చేశారు.
సౌదీ అరేబియా ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో ఒక టెలీ కమ్యూనికేషన్స్ ఫెసిలిటీ పక్కన ఉన్న ముగ్గురు పిల్లలు మరణించారు. ఈ ఘటనతో యెమెన్ అంతటా ఇంటర్నెట్ బ్లాక్ ఔట్ అయింది. క్షిపణులను ప్రయోగించినప్పుడు సమీపంలో ఫుట్బాల్ ఆడుతున్న పిల్లలు మరణించినట్లు తెలుస్తున్నది. సౌదీ అరబ్ ఎమిరేట్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న వైమానిక దాడుల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కూడా భాగస్వామిగా మారింది. ఇంతకుముందు సోమవారం జరిగిన దాడిలో ముగ్గురు పిల్లలు మరణించారు.
వైమానిక దాడుల తర్వాత సాదా జైలు ప్రాంగణం అంతా సహాయ సిబ్బంది, హెల్త్ వర్కర్లతో నిండిపోయింది. 70 మంది మరణించారని, మరో 138 మంది గాయ పడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రెండు దవాఖానల్లో భారీగా గాయపడిన వారు చేరారు. ఇదిలా ఉంటే, కొందరి ఆచూకీ తెలియడం లేదని అంటున్నారు.