లండన్, మే 24: విదేశీ విద్యార్థులకు సంబంధించి యూకే ప్రభుత్వం కొత్త ఇమిగ్రేషన్ నిబంధనను ప్రకటించింది. ఇక నుంచి యూకేలోని విద్యాలయాల్లో పీజీ చదువుతున్న విద్యార్థులకు మాత్రమే వారి కుటుంబసభ్యులను డిపెండెంట్లుగా యూకేకు తీసుకువచ్చే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.
భారత్ సహా అన్ని దేశాల విద్యార్థులకూ ఈ కొత్త నిబంధన వర్తించనున్నది. పీజీ విద్యార్థులు వారి పిల్లలు, తల్లిదండ్రులు సహా కుటుంబసభ్యులను డిపెండెంట్లుగా యూకేకు తీసుకురావచ్చని ఆ దేశ హోం సెక్రటరీ బ్రావెర్మెన్ తెలిపారు. ఈ మేరకు హౌజ్ ఆఫ్ కామన్స్కు రాతపూర్వకంగా తెలియజేశారు.