ఖాట్మండు: నేపాల్ రాజధాని ఖాట్మండులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఖాట్మండులోని నేపాల్ ఫెడరల్ పార్లమెంట్ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటికి నిప్పటించుకుని మంటలకు తాళలేక రోడ్డుపై అటూ ఇటూ పరుగులు తీశాడు. వెంటనే పార్లమెంట్ భద్రతా సిబ్బంది మంటలను ఆర్పేసి అతడిని చికిత్స నిమిత్తం కిర్టిపూర్లోని ఆస్పత్రికి తరలించారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు.. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి ఇల్లామ్ జిల్లాకు చెందిన ప్రేమ్ ప్రసాద్ ఆచార్యగా గుర్తించారు. అతడు ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశాడనే వివరాలు మాత్రం వెల్లడికాలేదు. కాగా, ప్రేమ్ ప్రసాద్ మంటల్లో కాలిపోతూ రోడ్డుపై పరుగులు తీయడం చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.