న్యూయార్క్: అమెరికాలో కాల్పుల ఘటన జరిగింది. బ్రాంక్స్లో ఉన్న మౌంట్ ఎడన్ అవెన్యూ సబ్వే స్టేషన్లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతిచెందారు. మరో అయిదు మంది గాయపడ్డారు. రెండు టీనేజ్ గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ కాల్పులకు దారి తీసినట్లు తెలుస్తోంది. సబ్వే రైలు డోర్లు తెరుచుకున్న సమయంలో కాల్పులు జరిపారు. సాయంత్రం స్కూల్ పిల్లలు, వర్కర్లు ఎక్కువగా రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఆ సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బాధితుల్లో గొడవపడిన వ్యక్తులు కొందరు కాగా, కొందరు స్టేషన్లో నిలుచున్న ప్రయాణికులు ఉన్నారు.