కొలంబో, మే 16: శ్రీలంకలో ఆయిల్ నిల్వలు నిండుకున్నాయి. పెట్రోల్ నిల్వలు ఒక్కరోజుకు సరిపడా మాత్రమే ఉన్నాయని దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే వెల్లడించారు. ఆయిల్ దిగుమతుల కోసం చెల్లించేందుకు డాలర్లు కూడా తమ వద్ద లేవన్నారు. సోమవారం దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో దేశం మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అబద్ధాలు చెప్పదలచుకోలేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయని, చివరి ప్రయత్నంగా డబ్బు ప్రింటింగ్ వైపు మొగ్గుచూపుతామని అన్నారు. మరోవైపు దేశంలో ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించారు.