బ్రిటన్లో ఒమిక్రాన్ వైరస్తో ఇప్పటివరుకు 14 మంది చనిపోగా.. 129 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆ దేశ జూనియర్ ఆరోగ్య మంత్రి జిల్లియాన్ కీగన్ బుధవారం తెలిపారు. పరిస్థితి తీవ్రతను బట్టి మళ్లీ కోవిడ్ ఆంక్షలు పెట్టే అవకాశముందని ఆమె అన్నారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యూరప్ దేశాలలో వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో క్రిస్మస్ పండుగ వేడుకలు సమూహాలుగా జరపడం ప్రమాదకరమని.. దీవివల్ల ఒమిక్రాన్ కేసులు పెరిగి, మరణాలు కూడా అధికం అయ్యే అవకాశముందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డెల్టా వేరియంట్ కన్నా ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం తక్కువగా ఉన్నా మరణాలు సంభవించే అవకాశం లేకపోలేదని వారన్నారు.
మరోవైపు క్రిస్మస్ పండుగకు మందు ఎలాంటి కరోనా ఆంక్షలు విధించేది లేదని బిట్రన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మంగళవారం ప్రకటన చేయడం గమనార్హం.