ప్యాంగ్యాంగ్, మార్చి 10: యుద్ధానికి సిద్ధం కావాలని ఉత్తర కొరియా మిలటరీ అధికారులను ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించారు. కుమార్తెతో కలిసి ఆర్మీ డ్రిల్స్కు హాజరైన ఆయన.. అసలైన యుద్ధానికి సన్నాహాలు చేయాలని తెలిపారు.
సోమవారం నుంచి అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో కిమ్ ఈ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకొన్నది.