న్యూఢిల్లీ: కొత్త తరహా హైటెక్ ఆయుధాలను ఉత్తర కొరియా(North Korea) పరీక్షించింది. ఎప్పుడూ బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలతో హోరెత్తించే ఆ దేశం ఇప్పుడు తాజాగా ఎలక్ట్రోమ్యాగ్నటిక్ వెపన్స్, కార్బన్ ఫైబర్ బాంబులను పరీక్షించింది. వీటితో పాటు న్యూ మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా పరీక్షించినట్లు ఆ దేశ మీడియా పేర్కొన్నది. మూడు రోజుల పాటు ఆ పరీక్షలు జరిగినట్లు ఉత్తర కొరియా జనరల్ కిమ్ జాంగ్ సిక్ తెలిపారు. దేశ ఆయుధ బాండాగారంలో కొత్త తరహా ఆయుధాలు చేరాయని, ఎలక్ట్రోమ్యాగ్నటిక్ సిస్టమ్తో పాటు కార్బన్ ఫైబర్ బాంబులు ప్రత్యేక అసెట్స్ కానున్నట్లు చెప్పారు. అయితే ఈ కొత్త తరహా ఆయుధాల గురించి ఆయన ఎక్కువ సమాచారం ఇవ్వలేదు.
నార్త్ కొరియా భూభాగం నుంచి అనేక మిస్సైళ్లను లాంచ్ చేసినట్లు గుర్తించామని దక్షిణ కొరియా మిలిటరీ పేర్కొన్నది. ఆ ప్రొజెక్టైల్స్ సుమారు 240 నుంచి 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉంటాయని పేర్కొన్నారు. బ్లాకౌట్ కార్బన్ ఫైబర్ బాంబ్లతో.. ఎలక్ట్రిక్ గ్రిడ్లు, పవర్ ప్లాంట్ను నిర్వీర్యం చేయవచ్చు. ఆ బాంబుల నుంచి విడుదలయ్యే గ్రాఫైట్ ఫిలమెంట్లు ఎలక్ట్రిక్ గ్రిడ్లలో షార్ సర్య్యూట్ అయ్యేలా చేస్తాయి. నాన్ న్యూక్లియర్ ఎలక్ట్రోమ్యాగ్నటిక్ పల్స్ వెపన్ ఓ ప్రత్యేకమైన డివైస్. దీనితో మిలిటరీ అసెట్స్లో ఉన్న ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను న్యూట్రలైజ్ చేయవచ్చు. రేడార్ వ్యవస్థలను, విమానాలను ఈఎంపీ వెపన్తో నిర్వీర్యం చేయవచ్చు. హాసాంగ్-11 అణు సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణికి కొత్త తరహా క్లస్టర్ వార్హెడ్ను అమర్చి పరీక్ష చేసినట్లు ఉత్తరకొరియా మీడియా పేర్కొన్నది.