సియోల్, మార్చి 24: సముద్ర గర్భంలో అణ్వాయుధ డ్రోన్ను ఉత్తర కొరియా పరీక్షించింది. ఇప్పుడు తమ దేశం రేడియో యాక్టివ్ సునామీని సృష్టించే సామర్థ్యం కలిగి ఉన్నదని సౌత్ కొరియాను హెచ్చరించింది. మార్చి 21 నుంచి 23 వరకు నిర్వహించిన పరీక్షలో మాక్ న్యూక్లియర్ వార్హెడ్లతో కూడిన క్రూయిజ్ క్షిపణులు కూడా ఉన్నాయని అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
ఈ డ్రోన్ పేలుడుకు ముందు కొరియా తూర్పు సముద్రంలో 80-150 మీటర్ల లోతులో 59.12 గంటలపాటు ప్రయాణించిందని ఉత్తర కొరియా వెల్లడించింది. దక్షిణ కొరియాతో సంయుక్తంగా సైనిక విన్యాసాలకు పాల్పడితే తాము పసిఫిక్ మహాసముద్రాన్ని ఫైరింగ్ రేంజ్గా మారుస్తామని యూఎస్ను హెచ్చరించింది.