ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా(North Korea) ఇవాళ క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించింది. రెండు వారాల వ్యవధిలోనే ఆ పరీక్షలు నిర్వహించడం వరుసగా ఇది నాలుగోసారి. ఇటీవల ఓ నేవీ షిప్యార్డ్ను ఆయన సందర్శించారు. యుద్ధ సన్నాహాలు చేసుకోవాలని అక్కడ ఆయన పిలుపునిచ్చారు. అయితే ఆ ఘటన జరిగిన కొన్ని రోజుల్లోనే మరోసారి ఉత్తర కొరియా పలు క్రూయిజ్ క్షిపణులను పరీక్షించింది. ఉత్తర కొరియా పశ్చిమ తీరం దిశగా ఉదయం 11 గంటల సమయంలో ఆ పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది. రిపోర్టర్లకు ఇచ్చిన సమాచారంలో దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఈ విషయాన్ని తెలిపారు.
నంపూ డాక్యార్ట్లో నిర్మిస్తున్న యుద్ధ నౌకల స్థావరాన్ని ఇటీవల ఉత్తర కొరియా నేత కిమ్ సందర్శించారు. సబ్మెరైన్ నుంచి కొత్తగా తయారు చేసిన క్రూయిజ్ మిస్సైల్ను పరీక్షించే సమయంలో ఆయన అక్కడే ఉన్నారు. కొత్తగా నిర్మిస్తున్న న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్ పనులను కూడా ఆయన సమీక్షించారు.