Nobel Prize | ఈ ఏడాదికి గాను అర్థశాస్త్రంలో క్లాడియా గోల్డిన్కు నోబెల్ పురస్కారం లభించింది. మహిళల లేబర్ మార్కెట్ ఫలితాలపై చేసిన విశేష కృషికి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నోబెల్ పురస్కారంతో సత్కరించింది. ఇప్పటికే పలు రంగాల్లో విశేష సేవలందించిన వ్యక్తులకు నోబెల్ పురస్కారాలను కమిటీ ప్రకటించింది. నోబెల్ విజేతలకు డిసెంబర్ 10న బహుమతులను ప్రదానం చేయనున్నారు.
గత ఏడాది నోబెల్ గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లు అందజేయగా.. ఈ సారి ఆ బహుమతిని మరింత పెంచుతూ 11 మిలియన్ల క్రోనర్లు ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా.. గతేడాది అర్థశాస్త్రంలో ముగ్గురు అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలు ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఎస్ బెర్నాంకే, డగ్లస్ డబ్ల్యూ డైమండ్, ఫిలిప్ హెచ్ ఫిలిప్ డైబ్విగ్ పురస్కారాన్ని అందుకున్నారు. ముగ్గురు ఆర్థికవేత్తలు బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై చేసిన పరిశోధనలకు అకాడమీ నోబెల్ పురస్కారంతో సత్కరించింది.