లండన్, ఏప్రిల్ 9: బ్రిటన్కు చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత పీటర్ హిగ్స్(94) సోమవారం కన్నుమూశారు. స్వల్ప అనారోగ్యానికి గురైన ఆయన తన ఇంట్లో తుదిశ్వాస విడిచారని ఎడిన్బర్గ్ యూనివర్సిటీ ప్రకటించింది. ఈ యూనివర్సిటీలో పీటర్ హిగ్స్ దాదాపు 50 ఏండ్లు ప్రొఫెసర్గా పని చేశారు. 1964లో ఆయన కనుగొన్న ద్రవ్యరాశి కణ సిద్ధాంతానికి గానూ 2013లో నోబెల్ అవార్డు దక్కింది. బెల్జియంకు చెందిన మరో భౌతిక శాస్త్రవేత్త ఫ్రాన్కోయిస్ ఎంగ్లర్ట్తో కలిసి సంయుక్తంగా హిగ్స్ నోబెల్ అందుకున్నారు.