సాంటో డొమింగో: కరేబియన్ దీవుల్లోని డొమినికన్ రిపబ్లిక్లో (Dominican Republic) ఘోర విమాన ప్రమాదం (jet crash) జరిగింది. ఈప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో కూడిన ఓ ప్రైవేటు విమానం డొమినికన్లోని లా ఇసబెల్లా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లోరిడా వెళ్తున్నది. టెకాఫ్ అయిన 15 నిమిషాలకే రాజధాని శాంటో డొమింగోలో ఉన్న లాస్ అమెరికాస్ ఎయిర్పోర్టులో అత్యవసరంగా లాండ్ అయింది.
ఈ క్రమంలో విమానం పేలిపోయిందని, తొమ్మిది మంది మరణించారని విమానయాన సంస్థ వెల్లడించింది. వారిలో ఆరుగురు విదేశీ ప్రయాణికులు, ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారని పేర్కొన్నది. అయితే వారు ఏ దేశానికి చెందిన వారనే విషయంపై స్పష్టనివ్వలేదని స్థానిక మీడియా వెల్లడించింది. మరొకరు డొమినకన్ అని తెలిపింది.