ఒటావా: కెనడాలోని నయాగరా వాటర్ఫాల్స్ త్రివర్ణాల్లో తణుకులీనింది. కొవిడ్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న భారత్కు సంఘీభావం తెలపడానికి ఇలా మన త్రివర్ణ పతాక రంగులను వాటర్ఫాల్స్పై ప్రదర్శించారు. భారత్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ దేశానికి సంఘీభావంగా అరగంట పాటు నయాగరా వాటర్ఫాల్స్ మూడు రంగులను ప్రదర్శించనున్నట్లు నయాగరా పార్క్స్ ట్వీట్ చేసింది.
ఈ పోస్ట్ వెంటనే వైరల్గా మారిపోయింది. ఇండియాకు మద్దతుగా నిలిచినందుకు ఎంతో మంది ట్విటర్లో నయాగరా పార్క్స్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకుముందు దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా, అబుదాబిలోని యస్ ఐలాండ్ కూడా ఇలా త్రివర్ణాలను ప్రదర్శించి భారత్కు సంఘీభావం తెలిపిన విషయం తెలిసిందే.