లండన్: వెడ్డింగ్ కేక్ ముక్క అదనంగా తిన్న ఒక గెస్ట్ను రూ.366 చెల్లించాలని వధువరులు డిమాండ్ చేశారు. ఒక పెండ్లికి వెళ్లిన తనకు ఎదురైన ఈ అనుభవాన్ని ఒక వ్యక్తి రెడ్డిట్తో పంచుకున్నాడు. బ్రిటన్కు చెందిన ఒక వ్యక్తి తన స్నేహితురాలి పెండ్లికి వెళ్లాడు. అయితే వెడ్డింగ్ కేక్ ముక్కను అదనంగా తిన్నాడు.
పెండ్లి తర్వాత అతడికి వధువు నుంచి చిన్న వీడియో క్లిప్ వచ్చింది. దీంతో అదేమిటని అతడు ఆమెను అడిగాడు. ‘మేము మా పెండ్లి వీడియో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించాం. అందులో నువ్వు వెడ్డింగ్ కేక్ రెండు ముక్కలు తిన్నావు. ఒక దానికే చెల్లించావు. రెండో దానికి 3.66 పౌండ్లు (రూ.366) పంపిస్తావా’ అని ఆమె అడిగింది. కాగా, వెడ్డింగ్ కేక్ ప్రతి పీస్కు గెస్ట్లు చెల్లించాలని ఆ జంట తొలుత పేర్కొంది. అయితే అనంతరం ఆ ప్రతిపాదనను విరమించుకున్నది.
కాగా, తనకు ఎదురైన ఈ అనుభవాన్ని రెడ్డిట్తో పంచుకున్న ఆ వ్యక్తి, వధువు పంపిన ఈ మెసేజ్ను కూడా అందులో పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఇది వైరల్ అయ్యింది. నెటిజన్లు దీనిపై మండిపడ్డారు. వెడ్డింగ్ కేక్ కోసం గెస్ట్ల నుంచి చార్జ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండ్లైన కొత్త జంట ఎంచక్కా హనీమూన్ను ఎంజాయ్ చేయకుండా సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి గెస్ట్లు ఎన్ని కేక్ ముక్కలు అదనంగా తిన్నారో చూసి వారికి మెసేజ్లు పంపడం చాలా చోద్యంగా ఉన్నదని ఒకరు విమర్శించారు.