ఈ ఫొటోలో కనిపిస్తున్న నౌక పేరు ‘గ్లోబల్ డ్రీమ్-2’. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్పుల్లో ఒకటైన దీనిలో 9 వేల మంది ప్రయాణించేలా డిజైన్ చేశారు. దీని నిర్మాణం జర్మనీ బాల్టిక్ తీరంలో దాదాపు పూర్తి కావచ్చింది. అయితే ఈ షిప్ను నిర్మిస్తున్న ఎంవీ వెర్ఫెన్ ఈ ఏడాది జనవరిలో దివాలా ప్రకటించింది.
ఇప్పుడు ఈ నౌకను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఈ షిప్ తొలి ప్రయాణం స్క్రాప్యార్డ్కే కానున్నది. స్క్రాప్ ధరకే షిప్ విడిభాగాలను విక్రయించేందుకు తయారీదారులు సిద్ధమయ్యారు. మెషినరీ, ఇతర భాగాలు అమ్ముతామని కంపెనీ అడ్మినిస్ట్రేటర్ పేర్కొన్నట్టు జర్మన్ మ్యాగజైన్ ‘యాన్ బోర్డ్’ పేర్కొన్నది.