లండన్: బ్రిటన్లో కరోనా కొత్త వేరియంట్ EG.5.1(ఎరిస్) వేగంగా వ్యాప్తి చెందడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది. గత నెల 31న ఈ వైరస్ వ్యాప్తిని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటించడంలో ఇంగ్లండ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్వో సూచించింది.
యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ లెక్కల ప్రకారం దేశంలో నమోదవుతున్న ప్రతి ఏడు కరోనా కేసుల్లో ఒకటి ఎరిస్ వేరియంట్ ద్వారా వ్యాపిస్తున్నదే. ఈ కొత్త వైరస్ ప్రమాదకరం కాదని డబ్ల్యూహెచ్వో తెలిపింది. దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య కొద్దిగా పెరిగినా.. ఇప్పటికీ తక్కువగానే ఉన్నదని అధికారులు వెల్లడించారు.