లండన్, మార్చి 19: అంగారకుడిపై నిర్మాణాలు చేసేందుకు సరికొత్త కాంక్రీటును తయారుచేశారు బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్కు చెందిన శాస్త్రవేత్తలు. భవిష్యత్తులో అంగారకుడిపై నిర్మాణాలు చేపట్టేందుకు భూమి నుంచి కాంక్రీటును తీసుకెళ్లడం కష్టం కాబట్టి అక్కడే లభ్యమయ్యే ధూళి, ఆలుగడ్డలు, ఉప్పును వినియోగించి ఈ కాంక్రీటును తయారుచేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కొత్త కాంక్రీటుకు ‘స్టార్క్రేట్’ అని పేరు పెట్టారు.