జెరూసలెం : ఇజ్రాయెల్-హమాస్ వార్ (Israel-Hamas War) కీలక మలుపు తీసుకుంటోంది. గాజా స్ట్రిప్పై అణుబాంబు వేసే అవకాశాలను ఇజ్రాయెల్ పరిశీలిస్తుందని ఇజ్రాయిలీ మంత్రి అమిహై ఎలియహు ప్రకటించడం కలకలం రేపింది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం కావడంతో అణు బాంబును ప్రయోగించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు మంత్రి బదులిస్తూ ఈ అంశాన్ని కూడా ఇజ్రాయెల్ పరిశీలిస్తోందని చెప్పడం హాట్ డిబేట్కు తెరలేపింది.
అణు యుద్ధానికి ఇజ్రాయెల్-హమాస్ వార్ దారితీస్తుందా అనే ఆందోళన నెలకొంది. కాగా ఇజ్రాయెల్ మంత్రి న్యూక్లియర్ బాంబు ప్రయోగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఎలియహు వ్యాఖ్యలపై నెతన్యాహు విరుచుకుపడుతూ మంత్రి వ్యాఖ్యలు వాస్తవం కాదని తోసిపుచ్చారు.
అమాయకులకు హానితలపెట్టని రీతిలో అత్యున్న అంతర్జాతీయ చట్ట ప్రమాణాలకు అనుగుణంగా ఇజ్రాయెల్, ఐడీఎఫ్ వ్యవహరిస్తున్నాయని స్పష్టం చేశారు. విజయతీరాలకు చేరేవరకూ హమాస్పై దాడులు కొనసాగుతాయని ట్విట్టర్ వేదికగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు పేర్కొన్నారు.
Read More :
Free Ration | మరో ఐదేండ్లు ఉచిత రేషన్.. ఎన్నికల వేళ ప్రధాని మోదీ తాయిలాలు