కొన్ని రోజులుగా ప్రపంచం ప్రపంచమే రష్యా- ఉక్రెయిన్ దిక్కు చూస్తోంది. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం అలుముకుంది. ఈ నెల 16 న రష్యా తన దళాలతో ఉక్రెయిన్పై విరుచుకుపడే ఛాన్స్ ఉందంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇలా చేస్తే దీని పరిణామం కేవలం యూరప్ దిక్కే కాకుండా భారత్, అమెరికాపై కూడా పడుతుంది. ఇప్పుడు ప్రపంచమంతా స్వేచ్ఛ విపణి అయిన నేపథ్యంలో ఈ తీవ్రత భారత్పై కూడా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. భారత్- ఉక్రెయిన్ మధ్య ఓ రిపోర్టు ప్రకారం 2020 సంవత్సరంలో 2.69 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. ఇందులో ఉక్రెయిన్ మన దేశానికి 1.97 బిలియన్ డాలర్ల ఎగుమతులు కూడా చేసింది.
ఇక భారత్.. ఉక్రెయిన్కు 721.54 మిలియన్ డాలర్ల ఎగుమతులు చేసింది. ఇక.. వంట నూనెలు, ఎరువులు, న్యూక్లియర్ రియాక్టర్లు, బాయిలర్స్ లాంటి అతి ముఖ్యమైన వాటిని మనం ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకుంటాం. ఇక.. భారత్… ఔషధాలు, ఎలక్ట్రికల్ మిషన్స్ను ఉక్రెయిన్ కొనుగోలు చేస్తోంది. న్యూక్లియర్ రియాక్టర్లు, బాయిలర్లు… ఇలాంటి వాటిని భారత్కు రష్యా తర్వాత సప్లై చేసే అతి పెద్ద దేశం ఉక్రెయినే. ఒక వేళ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వరకూ వెళితే మాత్రం అణుశక్తి విషయంలో భారత్ కాస్త ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయని నిపుణులు ఓ అంచనా వేస్తున్నారు.