వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతికి చెందిన బాలిక నటాషా పెరియనాయగం (13) అద్భుత ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థుల జాబితాలో వరుసగా రెండో ఏడాది చోటు దక్కించుకున్నది. అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ (సీటీవై) నిర్వహించిన పోటీ పరీక్షల్లో నటాషా సత్తా చాటింది.76 దేశాలకు చెందిన 15,300 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పరీక్షల్లో కేవలం 27% కంటే తక్కువ మంది మాత్రమే అర్హత సాధించారు. వారిలో నటాషా అందరి కంటే ఎక్కువ స్కోర్ సాధించి అగ్రస్థానంలో నిలవడం విశేషం.