వాషింగ్టన్: జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పూర్తిగా విచ్చుకొన్నది. రెండు వారాల క్రితం ఈ టెలిస్కోప్ను అంతరిక్షంలోకి పంపించారు. పరిశోధనలకు తగిన విధంగా, ముందుగా నిర్దేశించిన ప్రకారం టెలిస్కోప్ పూర్తిగా విచ్చుకోవడంతో తుది దశ ప్రయోగం విజయవంతమైందని నాసా శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఈ టెలిస్కోప్ను అంతరిక్షంలోకి పంపడం కోసం దాన్ని మడిచి రాకెట్లో అమర్చారు. డిసెంబర్ 25న ఏరియన్ రాకెట్ ద్వారా రోదసీలోకి పంపించారు.