న్యూయార్క్, అక్టోబర్ 11: అంతరిక్షం నుంచి భూమిపైకి తీసుకొచ్చిన బెన్ను గ్రహశకలం నమూనాల్లో నీరు, కార్బన్ ఆనవాళ్లు ఉన్నట్టు నాసా వెల్లడించింది. ఈ గ్రహశకలంలో నీరు, కార్బన్ సమృద్ధిగా ఉన్నట్టు.. అవే భూమి ఏర్పడటానికి కీలకమని నాసా పేర్కొంది. కాగా, ఇటీవల బెన్ను అనే గ్రహశకలం నుంచి రాళ్లు, దుమ్మును అంతరిక్షం నుంచి నాసా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2016లో నాసా ఓసిరిస్ రెక్స్ మిషన్ను ప్రయోగించగా.. ఆ మిషన్ 2020లో బెన్ను గ్రహశకలం నుంచి నమూనాలను సేకరించింది.