హూస్టన్: అమెరికాకు చెందిన నాసా ఓ కొత్త ఫోటోను షేర్ చేసింది. అంగారకుడి గ్రహంపై ఉన్న బిలం ఫోటోను నాసా ఇన్స్టాలో పెట్టింది. ఆ క్రేటర్ మార్స్ గ్రహంపై జీరో రేఖాంశం వద్ద ఉన్నట్లు తన రిపోర్ట్లో నాసా తెలిపింది. అయితే అరుణ గ్రహంపై గుబులు పుట్టించే రేంజ్లో కనిపిస్తున్న ఆ బలం ఫోటోపై నెటిజెన్లు కామెంట్లతో చెలరేగిపోతున్నారు. అదేదో పాకుతున్నట్లు ఉందని ఒకరు, అక్కడ నీళ్లు ఉన్నాయని మరొకరు, ఇది ఏలియన్ పాదముద్ర ఏమో అన్న అభిప్రాయాలను ఇన్స్టా యూజర్లు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మార్స్ రికన్నయ్సెన్స్ ఆర్బిటర్లో ఉన్న హై రెజల్యూష్ ఇమేజింగ్ సైన్స్ కెమెరాలకు ఆ బిలం ఫోటో చిక్కింది. నాసా షేర్ చేసిన అంగారక బిలం ఫోటోకు ఇప్పటికే 5 లక్షల లైక్లు వచ్చేశాయి. ఆ బిలాన్ని ఎయిరీ క్రేటర్ అని నాసా తేల్చింది. రెడ్ ప్లానెట్పై జీరో రేఖాంశంలో ఆ బిలం ఉన్నట్లు నాసా చెప్పింది.