nuclear rocket| వాషింగ్టన్: అంగారకుడికిపైగా వ్యోమగాములను మోసుకెళ్లే అణుశక్తి ఆధారిత రాకెట్ను అభివృద్ధి చేసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయత్నిస్తున్నది. రాకెట్ను రూపొందించే బాధ్యతను లాక్హీడ్ మార్టిన్ అనే సంస్థకు అప్పగించింది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 500 మిలియన్ డాలర్ల ( సుమారు రూ.4 వేల కోట్లు) వెచ్చించనున్నది. 2027 నాటి కల్లా ఈ నూక్లియర్ రాకెట్ను పరీక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
నూక్లియర్ రాకెట్ను అభివృద్ధి చేయగలిగితే అంతరిక్ష ప్రయోగాల సమయం గణనీయంగా తగ్గుతుందని నాసా భావిస్తున్నది. అంతేగాకుండా ఇది ఎంతో సురక్షితమైనదని తెలిపింది. ప్రయోగం సమయం తగ్గించడం మార్స్ మిషన్లో అత్యంత కీలకం. ప్రయోగ సమయం పెరిగితే, ఎక్కువ సప్లయ్స్, ఎక్కువ సిస్టమ్స్ అవసరమవుతాయి. సమయం తగ్గించగలిగితే, మరిన్ని సైంటిఫిక్ ఎక్విప్మెంట్ పంపేందుకు వీలవుతుంది. ప్రస్తుతం ఉన్న సాంకేతికత ఆధారంగా మార్స్పైకి చేరుకునేందుకు దాదాపు ఏడు నెలల సమయం పడుతున్నది. నూక్లియర్ రాకెట్ అందుబాటులోకి వస్తే ఈ సమయం భారీగా తగ్గనుందని శాస్త్రవేత్తలు తెలిపారు.