ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆకాశంలో గుర్తు తెలియని ఎగిరే వస్తువు (యూఎఫ్వో) కలకలం రేపింది. బర్మింగ్హామ్కు చెందిన వ్యాపారవేత్త 33 ఏండ్ల ఆర్స్లాన్ వార్రైచ్ తన డ్రోన్ ద్వారా దీని ఫొటోలు, వీడియోలు తీశారు. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో పోష్ జిల్లా గగనతలంపై ఈ యూఎఫ్వో చాలా సేపు ఎగిరినట్లు ఆయన తెలిపారు. 12 నిమిషాలకుపైగా పలు కోణాల్లో దానిని చిత్రీకరించించడంతోపాటు సుమారు రెండు గంటలకుపైగా చూసినట్లు చెప్పారు. డ్రోన్ కెమేరాను జూమ్ చేయగా నల్లగా, త్రిభుజాకారంలో అది కనిపించిందని అన్నారు. అయితే అది పక్షి లేదా మరో డ్రోన్ కాదని చెప్పారు.
మరోవైపు ఈ మిస్టరీ యూఎఫ్వో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై ఆన్లైన్లో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. చాలా మంది నెటిజన్లు యూఎఫ్వోలపై తమదైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే ఇది పెద్ద గాలిపటం కావచ్చని కొందరు తెలిపారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్ పక్కనే ఉన్న రావల్పిండిలో బసంత్ ఫెస్టివల్లో భాగంగా పెద్ద ఎత్తున గాలిపటాలు ఎగురవేస్తారని చెప్పారు. దీనికి సంబంధించిన ఒక కథనాన్ని ఒకరు షేర్ చేశారు.