న్యూయార్క్: కృత్రిమ మేధ(ఏఐ)తో మానవాళికి ముప్పు పొంచివున్నదని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. ఒక పాపులర్ చాట్బాట్ ఉదారవాద పక్షపాతంతో ఉన్నదని ఇటీవల ఆవిష్కృతమైన చాట్జీపీటీని ఉద్దేశించి పేర్కొన్నారు.
ఇటువంటి వాటిని ఎదుర్కొనేందుకు తాను ఏఐ ఆధారిత చాట్బాట్ ‘ట్రూత్జీపీటీ’ని తీసుకొచ్చే ప్రణాళికలో ఉన్నట్టు వెల్లడించారు. తన ట్రూత్జీపీటీ విశ్వం స్వభావాన్ని అర్థం చేసుకొనేందుకు ప్రయత్నించే గరిష్ట సత్యాన్వేషణ టూల్గా ఉంటుందని చెప్పారు.