రాబత్: మొరాకో భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. శుక్రవారం రాత్రి 11.11 గంటలకు సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. భూకంపం అనంతరం 4.9 తీవ్రతతో 19 నిమిషాలపాటు పలు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రకంపనలు ఇప్పటివరకు మొత్తం 632 మందిని పొట్టన పెట్టుకున్నాయి. దాదాపు మరో 350 మందికిపైగా గాయపడ్డారు. ఈ భూకంపం భారీ నుంచి ప్రాణాలతో బయటిపడిన కొందరు తమ అనుభవాలను మీడియాతో పంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే మైఖేల్ బైజట్ అనే 43 ఏళ్ల వ్యక్తి కూడా భూకంప సమయంలో తన అనుభవాన్ని వెల్లడించాడు. భూకంపం సంభవించినప్పుడు తాను నిద్రలో ఉన్నానని, మంచం ఊగిపోతుండటంతో తనకు మెళుకువ వచ్చిందని, కళ్లు తెరచి చూడగానే మంచం గాల్లో తేలిపోతున్నట్లుగా అనిపించిందని మైఖేల్ తెలిపారు. ఆ తర్వాత తేరుకుని భూకంపం చోటుచేసుకుందని గ్రహించానని, భయంతో అర్ధనగ్నంగానే బయటికి పరుగులు తీశానని మైఖేల్ బైజట్ చెప్పాడు.